Amaravati New Look with development works

ఓ వ్యక్తి మీద మరో వ్యక్తి పగపట్టడం చూశాము కానీ ముఖ్యమంత్రే తన రాష్ట్రం మీద పగబట్టడం వైసీపీ పాలనలోనే చూశాము.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గర్వంతో చెప్పుకోవలసిన రాజధాని అమరావతిని జగన్‌ ఓ శిధిల నగరంగా మార్చేశారు. రాజధాని రైతుల ఆందోళనలు తప్ప అమరావతిలో మరేవీ కనిపించేవి కావు.

Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఈ తొమ్మిది నెలల్లో జంగిల్ క్లియరెన్స్ పనులన్నీ పూర్తిచేసి, రోడ్లను సరిచేసి స్ట్రీట్ లైట్స్ వెలిగిస్తుండటంతో రాత్రి వేళల్లో కూడా అమరావతి ఆ విద్యుత్ కాంతులలో ధగధగా వెలిగిపోతోంది.

ఇప్పటికే నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ చురుకుగా సాగుతోంది. త్వరలో నిర్మాణ పనులు మొదలైతే అమరావతి మరింత సందడిగా మారుతుంది.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

అమరావతి నవనగరాలలో భాగంగా మంగళగిరి సమీపంలో నిడమర్రులో 6,577 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్‌, హైటెక్ సిటీలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతంలోనే అన్ని ఐటి కంపెనీలు కంపెనీలకు భూములు కేటాయిస్తోంది.

ముందుగా 10 ఎకరాలలో ఓ ఐకానిక్ ఐటి టవర్ నిర్మించే బాధ్యత ఎల్&టి కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. దీనిని ‘డీప్‌టెక్ ఐకానిక్ టవర్‌’గా నిర్మించబోతోంది. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిలో ఐటి కంపెనీలకు అద్దెకు ఇస్తుంది.

Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఐటి కంపెనీలకు, ఇకపై కొత్తగా రాష్ట్రానికి వచ్చే ఐటి కంపెనీలకు నిడమర్రులోనే ప్రభుత్వం భూములు కేటాయించబోతోంది. కనుక హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు ధీటుగా ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందబోతోంది.




గత 5 ఏళ్ళుగా శిధిల నగరంగా మిగిలిపోయిన అమరావతి కేవలం 9 నెలలో ఇంత మార్పు రావడానికి కారణం సిఎం చంద్రబాబు నాయుడు ధృడ సంకల్పం, నిబద్దత, దూరదృష్టి కారణమని వేరే చెప్పక్కరలేదు.