Chandrababu Naidu Started Fisher Man Scheme

చంద్రబాబు నాయుడు, కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన్నట్లు ప్రజలకు వాగ్ధానాలు చేసేసి వారిని మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చారని 10 ఎమ్మెల్యేల అధినేత జగన్‌ పదేపదే ఆరోపిస్తుంటారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీనీ నెరవేర్చకుండా నిర్భయంగా ప్రజలను మోసం చేస్తున్నారని, వాటి గురించి తాము అడుగుతుంటే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్‌ అండ్ కో వాదిస్తుంటారు.

ఓ పక్క సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కో హామీనీ అమలుచేస్తుండటంతో, ఆ విషయం కూటమిలో కోవర్టుల ద్వారా ముందే తెలుసుకొని ఆ హామీ అమలుచేయాలంటూ వైసీపీ ధర్నాలు, దీక్షలు చేస్తుంది.

Also Read – వచ్చే తెలంగాణ ఎన్నికలలో గేమ్ చేంజర్‌: హరీష్ రావు?

అప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఆ హామీ అమలు చేయగానే మేము పోరాడి ఆయన మెడలు వంచి హామీ అమలుచేయించామని హామీ క్రెడిట్ సొంతం చేసుకుంటుంటారు. అయితే ఈసారి వైసీపీకి అవకాశం కూడా లేకుండా చేశారు సిఎం చంద్రబాబు నాయుడు.

చడీ చప్పుడూ లేకుండా మత్స్యకార భరోసా పధకాన్ని అమలుచేశారు. ఈ పధకంలో భాగం రాష్ట్రంలో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున నిధులు విడుదల చేశారు. వారందరికీ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల పంపిణీ చేయిస్తున్నారు.

Also Read – ఇదిగో అదంపూర్ వైమానిక స్థావరం.. ఫోటోలు చూసుకోండి: మోడీ

ఏటా ఏప్రిల్-మే నెలల్లో రెండు నెలల పాటు సముద్రంలో చేపలు గుడ్లు పెడుతుంటాయి. ఆ సమయంలో చేపల వేటపై నిషేధం ఉంటుంది కనుక మత్స్యకారులకు ఆదాయం ఉండదు. వారిని ఆదుకునేందుకు టీడీపీ 2014లో ఈ పధకం ప్రవేశపెట్టి అమలు చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా అమలు చేస్తోంది.

ఈవిదంగా సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కో పధకం అమలుచేస్తుంటే, ఇక తాము దేని కోసం పోరాడాలి? ఎవరితో పోరాడాలి? అని వైసీపీ అధినేత తాడేపల్లి ప్యాలస్‌లో తల పట్టుకొని కూర్చొని ఉండవచ్చు.

Also Read – ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇస్తే క్రెడిట్ జగన్‌కి!

జగన్‌ గొప్పగా చెప్పుకునే పధకాలలో ‘అమ్మ ఒడి’ ఒకటి. ఆ పధకంతో ఇంట్లో ఇద్దరి పిల్లల చదువులకి రూ.10 వేలు చొప్పున ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్‌, ఆ తర్వాత ఆ భారం తగ్గించుకునేందుకు ఒకరికే రూ.7-8,000 చేతిలో పెట్టి మమ అనిపించేశారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పిల్లల్ని కంటే వారికి కూడా ఇస్తామని చెపుతున్నారు!




ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు రూ.20,000 చొప్పున అందిస్తున్నారు. ఇలా అయితే వైసీపీలకు పనిలేకుండా పోతుందిగా!