
బాపట్ల జిల్లాలోని ఆలపాడు గ్రామంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కోసం ఓ అభిమాని గుడి నిర్మించాడు. ఈ ఘటన సమంత పుట్టినరోజు సందర్భంగా జరిగింది, ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టి.ఎం. సందీప్ అనే అభిమాని, సమంత దాతృత్వం మరియు సినిమాల్లో ఆమె నటనకు ముగ్ధుడై, తన ఇంట్లో ఈ గుడిని నిర్మించాడు. 2023లో సమంత పుట్టినరోజున ఈ గుడిని ప్రారంభించిన సందీప్, ఈ ఏడాది ఆమె విగ్రహాన్ని స్థాపించి పూజలు నిర్వహించాడు. సమంత సినిమాలు, ఆమె సేవా కార్యక్రమాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయని, కరోనా సమయంలో సమంత సేవా కార్యక్రమాలు చేసిన తీరు అతడిని ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించిందట.
Also Read – జగన్ బెదిరింపులు తాటాకు చప్పుళ్ళు కావు సుమా!
సమంత ప్రస్తుతం తన మొదటి నిర్మాణ చిత్రం శుభం కోసం బిజీగా ఉంది, ఇది మే 9, 2025న విడుదల కానుంది. ఈ మధ్య సమంత, రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆమె రాజ్ నిడమోరుతో కలిసి తిరుపతి బాలాజీ ఆలయంలో పూజలు చేసింది. “మా చిన్న టీమ్కి పెద్ద కలలున్నాయి,” అని సమంత ఈ ప్రాజెక్ట్ చెప్తుంది. తమిళనాడులో ఖుష్బూ, నమిత వంటి నటీమణులకు గుడులు నిర్మించిన ఉదాహరణలు ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. సమంత ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.