
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాడి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో, ‘తెలంగాణ వాదం’ అనే ప్రాంతీయతత్వంతో ఏర్పడిన పార్టీలు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.
తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించిన ఈ రెండు పార్టీలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో, పాలనాపరమైన గుర్తింపుతో వారి వారి రాజకీయ సిద్ధాంతాలతో ప్రజల మన్ననలు పొందాయి. హైటెక్ ముఖ్యమంత్రి గా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు, ఉద్యమ నాయకుడిగా తెరాస పార్టీ అధినేత చంద్రశేఖర్ ఈ ఇద్దరు చంద్రులు కూడా పాలనలో తనదైన మార్క్ చూపించారు.
Also Read – అమెరికాపై దాడులు జరిగితే ట్రంప్ ఇలాగే స్పందించేవారా?
40 ఏళ్ళ టీడీపీ చరిత్ర, 25 ఏళ్ళ బిఆర్ఎస్ ప్రస్థానం రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. అయితే టీడీపీ అధినేత సంక్షోభాలతో అవకాశాలను సృష్టించుకుంటే, బిఆర్ఎస్ అధినేత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఓటమి గెలుపుని ఒకే తీరుగా చూసే బాబు ఓటమితో కుంగిపోలేదు, అవమానాలకు తలవంచలేదు.
పదేళ్ల అధికార పక్షంలోను, పదిహేనేళ్ల ప్రతిపక్షం లోను ఒకే విధమైన రాజకీయంతో ముందుకెళ్లారు, తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు బాబు. అయితే పదిహేనేళ్ల పోరాటంలో ఎన్నడూ తడబడని కేసీఆర్ పదేళ్ల అధికారానికి దూరమయ్యే సరికి మాత్రం తట్టుకోలేకపోతున్నారు.
Also Read – ‘బతుకమ్మ’ ఆడిన మిస్ వరల్డ్ బ్యూటీస్…!
వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ సైకిల్ పనైపోయింది, ఇక ఏపీలో పసుపు జెండా కనుమరుగే అంటూ అప్పటి ప్రభుత్వపెద్దలు టీడీపీ ఆత్మ స్తైర్యం మీద కొట్టారు. అలాగే రాష్ట్ర విభజనతో తెలంగాణలో పుట్టిన టీడీపీ ని తెలంగాణ వాదం అనే ప్రాంతీయ వాదంతో మట్టికరిపించారు కేసీఆర్.
ఇక 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి ఆ పార్టీని నైతికంగా కుంగతీసింది. దానికి తోడు వైసీపీ రాజకీయంలో అధినేత బాబు బంది అవడం ఇక ఏపీలో టీడీపీ శకం ముగిసింది అంటూ టీడీపీ మనోధైర్యం మీద దెబ్బ కొట్టారు వైస్ జగన్. ఇలా రాజకీయంగా టీడీపీ ని భూస్థాపితం చెయ్యాలన్న పార్టీ సారి పడిలేచిన కెరటం మాదిరి టీడీపీ ప్రత్యర్థులను ప్రత్యక్షం గానో, పరోక్షంగానో ముంచేస్తుంది.
Also Read – అక్కడ కాళేశ్వరం.. ఇక్కడ పోలవరం సేమ్ టూ సేమ్?
ఇక బిఆర్ఎస్ విషయానికొస్తే, ఒకప్పుడు అక్షయ పాత్రలా నిండుగా ఉండే కేసీఆర్ కారు ఇప్పుడు గ్యారేజిలో ఖాళీగా దర్శనమిస్తుంది. 2023 ఎన్నికలలో ఆ పార్టీ ఓటమితో ఇప్పటి వరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ క్యాడర్ కు అందుబాటులోకి రాలేకపోయారు. ఏ ప్రాంతీయ వాదం మీద పార్టీ ఆవిర్భవించిందో అదే ప్రాంతీయ వాదాన్ని పక్కన పెట్టి తెరాస, బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది.
కానీ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు తెలుగు వాడి ఆత్మ గౌరవం, తెలుగు జాతి అభ్యున్నతి అంటూ ముందుకెళుతున్న టీడీపీ ఇప్పటికి అదే సిద్ధాంతానికి కడ్డుబడి రాజకీయం చేస్తుంది. ఈ ఒక్క కారణం తో బిఆర్ఎస్ పదేపదే టీడీపీ ని హేళన చేసినా, ఆ పార్టీని రెచ్చకొట్టేలా దూషించినా ఇప్పటికి సంయమనంతో రాజకీయం చేస్తుంది.
అయితే ఈ నెల 27 న జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఓటమితో నైరాశ్యంలోకి వెళ్లిన ఆ పార్టీకి తిరిగి జీవం పోస్తుందా అన్నది చూడాలి.