
అయితే, తుది మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని జాబితాలో నుండి కొన్ని గ్రామాలను తొలగించారు. గతంలో ప్రతిపాదించిన గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, వడ్డమాను, పెదపరిమి గ్రామాలను తొలగించారు. అలాగే కృష్ణాజిల్లాలోని కోటికలపూడి, మూలపాడు, త్రిలోచనపురం, వడ్దేశ్వరాలను కూడా తొలగించారు. భూసమీకరణ చేపట్టని ఈ గ్రామాలను కూడా రాజధానిలో చేర్చడం పట్ల రాజధాని గ్రామ వాసులలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, వీటిని తొలగించినట్లుగా సీఆర్డీఏ అభిప్రాయ పడింది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల అభిప్రాయాలకు మిక్కిలి గౌరవం ఇస్తామని సీఆర్డీఏ తెలిపింది.
ఊహించని ఈ ట్విస్ట్ తో సదరు 9 గ్రామాల జనులు అవాక్కయ్యారు. గతంలో రాజధాని గ్రామాలు అంటూ ఎంతో ప్రాధాన్యతను దక్కించుకున్నాయని, కానీ తాజా పరిణామాలతో ఆ విశిష్టత దూరమవుతుందని ఆందోళన చెందుతున్నారు. అలాగే, ఆ 9 గ్రామాల్లో కూడా రియల్ ఎస్టేట్ భారీ స్థాయిలో పడిపోయే అవకాశాలు కనపడుతున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…