
దీనికి కారణం పుల్వామాలో ముష్కరుల దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడి వల్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దాడి ఎఫెక్ట్ ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ఘటనతో దేశవ్యాప్తంగా దేశభక్తి పెల్లుబిక్కుతుంది. ఈ ఉదంతాన్ని ప్రభుత్వం బానే హేండిల్ చేసిందని, పాకిస్తాన్ కి గట్టిగానే సమాధానం చెప్పింది అనే అభిప్రాయం ఉండడం వల్లే జనాలు బాగా వచ్చారని విశ్లేషకుల అంచనా. బీజేపీ బాగా బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే ఆ ప్రభావం ఉంటే దేశవ్యాప్తంగా మరింత ఎక్కువ ఉండొచ్చు.
ఇది ఎన్నికలలో ఉపయోగపడితే బీజేపీ మరొక సారి సొంతంగా అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. వచ్చే వారంలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఏప్రిల్ – మే లో జరిగే ఎన్నికల గురించి ఇప్పటినుండే అన్ని వర్గాలలోనూ ఆసక్తి ఉంది. ప్రతిపక్షాల అశక్తత, ఈ వ్యవహారంలో వచ్చిన మైలేజ్ కారణంగా తిరిగి వస్తాం అని కమలనాథులలో అంచనాలు ఉన్నాయి. మోడీ అయితే ఈ పాటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు. సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్నా ప్రచారం ఆపకపోవడం విశేషం.
The general trend is that the urban population are generally slow and low when it…
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…