
నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి 101 ఉంది. మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్లయితే అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా పోతుంది. మరోవైపు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో చర్చలు జరుపుతున్నారని అధికార పార్టీ చెబుతోంది. నాలుగు నెలల క్రితం తెలంగాణాలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కనిపించకుండా ఉన్న ఈ నాయకులకు ఎన్నికల ఫలితాల తరువాత బంగారు తెలంగాణ స్వప్నం కనిపించడం, అది కేసీఆర్ ఒక్కరి వల్లే సాధ్యం అనిపించడం విశేషం.
పార్లమెంట్ ఎన్నికలకు ఇంకో మూడు వారాలు కూడా లేని ఈ సమయంలో ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరిగా పార్టీ నుండి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో అయోమయం ఎక్కువైంది. సీనియర్ నాయకురాలు డీకె అరుణ కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరడం విశేషం. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పైన బీజేపీ వస్తుందని ఆమె చెప్పకనే చెప్పింది. లేకపోతే తెలంగాణాలో ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేని బీజేపీలో చేరడం ఏంటి? దీనితో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గుండు సున్నా తెచ్చుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.
An Indian national on a student visa has been detained in the United States over…
ఈమధ్యకాలంలో మన దర్శకులు, కథానాయకులు సంక్రాంతి సీజన్ మీద మరీ ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసి మిగతా హాలిడే సీజన్…