
2014 మార్చి నుండి 2015 నవంబర్ వరకు పలు దఫాలుగా నిర్వహించిన దాడులలో దాదాపు 16 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించినట్లు రెవిన్యూ కార్యదర్శి హస్ ముఖ్ అధియా తెలిపారు. అలాగే గుర్తించిన 16 వేల కోట్లలో ఇప్పటివరకు 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం స్వాధీన పరచుకుని, మొత్తం 774 కేసులను నమోదు చేసిందని వివరించారు. బ్లాక్ మనీ అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, విదేశాల నుండి నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విండో ద్వారా 4,160 కోట్లు వచ్చాయని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్ధంగా ఉన్నారని సదరు రెవిన్యూ కార్యదర్శి చెప్పుకొచ్చారు.
The glimpse of Gold Spot has arrived with a nostalgic flavour, offering a look into…
Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…