
ఆయన జనసేన తరపున పాలకొల్లు సీటును ఆశిస్తున్నారట. ఈ మధ్య ఆయన పార్టీలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. ఈ నెల 15న రాజమహేంద్రవరం లో జరగబోయే భారీ బహిరంగసభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణ కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఒక కమిటిలో ఆయనకు కూడా స్థానం దక్కింది. దీనితో ఆయనకు బహుశా సీటు అనేది కన్ఫర్మ్ అని జనసైనికులు అనుకుంటున్నారు. ఆ సభ తరువాత జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది.
జనసేన ఏర్పాటయ్యి ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది జనసేన పార్టీ. ఈ సభనుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. పాలకొల్లు సీటు నుండి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ఇక్కడ పోటీని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. చిరంజీవి సాధించలేనిది అల్లు అరవింద్ మనిషి సాధిస్తారా అనేది చూడాలి.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…