
కేసు వెలుగులోకి వచ్చిన కొత్తలో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల మధ్య తీవ్ర మాటల యుద్ధమే జరిగింది. చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేసీఆర్ వ్యాఖ్యానిస్తే, ఉమ్మడి రాజధానిలో తన ఫోన్ ట్యాప్ చేస్తారా? అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ పంచాయితీ పలుమార్లు గవర్నర్ వద్దకు వెళ్ళిన దరిమిలా, మధ్యవర్తిత్వం జరిపి, ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారన్న వార్తలూ వినిపించాయి. అందువల్లే కేసు నీరు గారిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఓ మారు జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చారు. ఆపై కేసీఆర్ కొనసాగించిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కుదేలైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీఆర్ పంచన చేరిపోయారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని గతంలో వెల్లడించిన కేసీఆర్, ఈ కేసుకు సంబంధించినంత వరకూ సర్దుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…