
మరోవైపు నిన్నటినుండి వివిధ ప్రసారమాధ్యమాలలో చంద్రబాబు అసెంబ్లీలో ఎన్డీయే నుండి బయటకు వస్తున్నట్టు ప్రకటన చేస్తారని, కనీసం కేంద్ర కేబినెట్ నుండి తమ మంత్రులను ఉపసంహరిస్తారని పుకార్లు షికార్లు చేసాయి. అయితే చంద్రబాబు మాత్రం కేంద్రాన్ని మరింత బ్రతిమాలటం, మరింత విజ్ఞప్తులు చేయడంతోనే సరిపెట్టారు.
నిన్న జరిగిన టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు అధినేతకు బీజేపీతో దోస్తీ మనకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటింగు పెట్టగా ఆరుగురు తప్ప మిగతావారంతా విడాకులకే ఓటు వేశారు, అయితే చంద్రబాబు మాత్రం ఆ దిశగా ముందడుగు వేయలేకపోయారు. దీనితో తెలుగు దేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
మరోవైపు ఇప్పటికిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే ఈ నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికలలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు పడవని చంద్రబాబు వెనక్కు తాగారేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కారణం ఏదైనా ఈ ధోరణి తెలుగు దేశం పార్టీకి ఇబ్బందికరంగా సంభవించే అవకాశం కనిపిస్తుంది.
Vijay has been facing multiple controversies in recent months, including the divorce issue and the…
Awarapan 2 has officially locked its release date and is set to arrive on August…