
పార్టీ సీనియర్లు, మంత్రులు, పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో విజయవాడలో వరుస భేటీలు నిర్వహించిన చంద్రబాబు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేంద్రం చేసిన సాయం, చేయాల్సిన సాయం తదితరాలకు సంబంధించి పక్కా లెక్కపత్రాలు సిద్ధం చేసుకున్నారు. కేంద్ర సాయానికి సంబంధించి అణా పైసలు సహా లెక్కలు వేసి అధికారులు ఇచ్చిన నివేదికలను చేతబట్టుకుని మోడీ వద్దకు వెళ్లనున్న చంద్రబాబు… గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా కాస్తంత గట్టిగానే తన స్వరాన్ని వినిపించాలని నిర్ణయించుకున్నారు.
‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు’ అన్న సింగిల్ నినాదంతో చంద్రబాబు వ్యూహం రచించుకున్నారు. మొత్తం 12 అంశాలను చంద్రబాబు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధానితో చంద్రబాబు భేటీలో ఏ ఫలితాలు వస్తాయన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీ చేరుకున్న వెంటనే, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు పార్టీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు, సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు.
Is Bollywood's biggest battle shifting from the box office to social media? Recent reports suggest…
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…