
నిషేధిత మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పర్యటించడం అంత శ్రేయస్కరం కాదని పోలీసు అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే మొన్నటిదాకా పోలీసు అధికారుల మాట వింటూ వస్తున్న చంద్రబాబు తాజాగా ముంపు మండలాల్లో పర్యటనకే మొగ్గు చూపారు. ఏది ఏమైనా సదరు మండలాలలో తాను పర్యటించి తీరాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ముంపు మండలాలలో పర్యటిస్తున్న చంద్రబాబు, పలు అబివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాక స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చంద్రబాబు అడుగుపెడుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…