
సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 43 శాతం పోలింగ్ మాత్రమే జరుగగా, ఈ సంఖ్య పూర్తయ్యే సమయానికి దాదాపుగా 48కి చేరుకోవచ్చని నిజామాబాద్ ఎంపీ కవిత తెలియజేసారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది పోలింగ్ శాతం పెరిగిందని 2009లో 42% నమోదైందని, 2002లో ఇది కేవలం 28 శాతమేనని కవిత వివరించారు. అయితే ఈ పెరుగుదల హర్షించదగ్గ విషయమే అయినా… పట్టణ ప్రాంత ప్రజల మనోభావాలను ఈ ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, నగర రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా డబ్బులు, మద్యం పంపిణీ అవుతుంటుంది. దీనికి గల కారణం ఈ ప్రాంత ప్రజలు వీటికి ఖచ్చితంగా లొంగి పోలింగ్ బూతు దాకా వస్తారు అని! నిజానికి పోలింగ్ పూర్తయిన తర్వాత గణాంకాలకు పరిశీలిస్తే సదరు రాజకీయ నాయకులు వేసిన అంచనాలు తారుమారు కావు. ఇప్పటికీ రూరల్ ప్రాంతాలలోనే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవుతోంది. అది తప్పు అని గ్రేటర్ వాసులు ఏమైనా నిరూపిస్తారేమోనని ఆసక్తిగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురయ్యింది.
నేడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఓడిపోయింది మాత్రం ప్రజలే..! ప్రజలు వినియోగించుకునే ఒక్క ఓటే దేశ భవిష్యత్తును తిరగరాయగలదు. అలాంటి అవకాశాన్ని దూరం చేసుకోవడం అంటే… పరోక్షంగా రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలకు ప్రజలు కూడా సహకారం అందించినట్లే కదా! ఏ పార్టీకి వేసామన్న దాని కంటే ఓటు హక్కును వినియోగించుకున్నామా లేదా అన్నదే ముఖ్యం. దీనికి గల కారణాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చు… ఒకరికి ఉద్యోగం.., మరొకరికి ఆరోగ్యం.., ఇంకొకరికి అత్యవసర పనులు… ఇలా లెక్కకు మించిన కారణాలు ఉండవచ్చు. అయితే ఆ అత్యవసర కారణాల, ఊళ్ళల్లో లేని వారిని 10 శాతంగా (7.4 లక్షల మంది చాలా ఎక్కువేమో… అయినా ఓకే) తీసివేసినా… 90 శాతం పోలింగ్ లో పోలైన ఓట్లు శాతం దాదాపు సగమే.
సంకల్పం ఉంటే పోలింగ్ బూతు దగ్గరికి వెళ్లి ఓటు వేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ మన ప్రజల్లో లేనిదే అది. ఇదే రోజు ఏ పవన్ కళ్యాణ్ సినిమానో, మహేష్ బాబు సినిమానో విడుదలైతే ఉద్యోగాలు నిర్వహించే వారిలో, కాలేజీలకు వెళ్ళే వారిలో సగం మందికి అప్పటికప్పుడు లేదా ముందు రోజు “జ్వరం” వచ్చేస్తుంది… లేదంటే ఇంకొకటి… కారణాలకు కొదవేమి లేదుగా..! ఇలా అభిమానించడం తప్పు కాదు, అయితే దేశ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదా! “నా ఒక్క ఓటే కదా” అని దాదాపు 35 లక్షల మంది ఒకే విధంగా ఆలోచించడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తింది.
Madhavan's GDN directed by Krishnakumar Ramakumar was released in theatres on August 7th and has…
Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…