
ఆ పార్టీ చెందిన టీఆర్ఎస్ మిషన్ అనే యాప్ లో కూడా ప్రజల డేటా, ప్రభుత్వ పథకాల లబ్ది దారుల వివరాలు ఉన్నట్టు తేలింది. ఈ యాప్ ను తెరాస ను సపోర్టు చేసే ఎన్నారైలు తయారు చెయ్యగా తెరాస ఎంపీ కవిత దానిని లాంచ్ చేశారు. ఒక నాయకుల మీటింగులో కేటీఆర్ లబ్దిదారుల వివరాలు అన్ని తమకు అందుబాటులో ఉన్నాయని వారిని చేరుకొని ఓట్లు అడగాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనితో అప్రమత్తమైన తెరాస వారు ఆ యాప్ ను ప్లే స్టోర్ నుండి ఉన్నఫళంగా తీసేశారు.
అసలు ఆ యాప్ తో పార్టీకి సంబంధమే లేదు అంటూ ప్రకటన చేసేశారు. అయితే ఆ యాప్ ని లాంచ్ చేస్తూ కవిత దిగిన ఫోటోలకు సమాధానం చెప్పే వారు లేరు. ఇదంతా ఎందుకు అనుకున్నారో ఏమో టీడీపీ కేసును కూడా ఇప్పుడు డేటా చోరీ వైపు కాకుండా ఓట్ల తీసివేతకు డేటా వుపయోగించారా అనే కోణంలోకి తిప్పేశారు. అన్నం వడ్డించే వాడు మనవాడైతే ఇంక మన ఇష్టం. అయితే ఈ మొత్తం విషయంలో పోలీసులు కొందరికి కావలసిన విధంగా ఆడటం గమనార్హం.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…