
అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు 9 పరుగుల వద్ద పార్థివ్ పటేల్ (1) వికెట్ కోల్పోయింది. అనంతరం అంబటి రాయుడు (25) తో కలసి ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, అమిత్ మిశ్రా వేసిన బంతికి పెవిలియన్ చేరిన రాయుడు తరువాత వచ్చిన కునాల్ పాండ్య (36) ధాటిగా ఆడాడు. సమన్వయ లోపంతో రనౌట్ గా వెనుదిరిగాడు.
ఆదుకుంటాడనుకున్న బట్లర్ (2) విఫలమవ్వగా, పొలార్డ్ (19) భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. అలాగే, హార్డిక్ పాండ్య (2) రనౌట్ కాగా, హర్భజన్ (0) విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా, జహీర్, మోరిస్ చెరోవికెట్ తీశారు. రనౌట్లు కొంప ముంచడంతో చివరి వరకు క్రీజులో ఉన్న రోహిత్ శర్మ జట్టును గెలిపించలేకపోయాడు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…