
స్వల్ప లక్ష్య చేధనలో ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్ జట్టును కెప్టెన్ సురేష్ రైనా 36 బంతుల్లో 53 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. రైనా రెచ్చిపోవడంతో కేవలం 13.3 ఓవర్లలో మ్యాచ్ ముగిసిపోయింది. ఈ విజయంతో 13 మ్యాచ్ లలో 16 పాయింట్లు అందుకుని దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరిన గుజరాత్ జట్టు తన చివరి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో శనివారం నాడు తలపడనుంది. ఈ మ్యాచ్ లో కూడా గుజరాత్ విజయం సాధిస్తే టాప్ 2 జట్లలో ఒకటిగా నిలవనుండగా, ముంబై విజయం అందుకుంటే ప్లే ఆఫ్స్ బెర్త్ లు మరింత రసకందాయంలో పడే అవకాశం ఉంది.
నేడు జరగనున్న కీలక మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ఢిల్లీ జట్టు నేడు జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉండగా, హైదరాబాద్ టీం ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. గుజరాత్ చేతిలో ఓడిన కోల్ కతా జట్టు ఒకే ఒక్క మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ జట్టుతో తలపడబోయే ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఇక, ఐపీఎల్ ను మోత మోగిస్తున్న బెంగుళూరు జట్టు తమ చివరి మ్యాచ్ లో ఢిల్లీ జట్టుతో తలపడనుంది. మిగిలి ఉన్న ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకు నాకౌట్ లాంటిదే కావడంతో మ్యాచ్ లన్నీ ఆసక్తికరంగా సాగుతాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
Is Bollywood's biggest battle shifting from the box office to social media? Recent reports suggest…
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…