
అవును… ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర సర్వే నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సర్వేపై తెలంగాణా ప్రజల్లో ఉన్న అపోహల మాదిరే ఏపీ ప్రజల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుండి సమాచారం సేకరించిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పధకాలలో కోతలు పడతాయోమో అన్న ప్రశ్న ప్రజల్లో ఎక్కువగా వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన ప్రకటన చేసారు.
ఈ సమగ్ర సర్వే ద్వారా రిజర్వేషన్లు ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పధకాలలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండబోవని, ఎవరూ భయాందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రజానీకం అంతా ప్రభుత్వానికి సహకరించి పూర్తి సమాచారం తెలపాలని పిలుపునిచ్చారు. మరి ఏపీ సర్కార్ అయినా చేపట్టిన సర్వే పేపర్లను సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి. తెలంగాణా సర్కార్ చేపట్టిన సర్వే పేపర్లు తర్వాతి కాలంలో కిరణా కొట్టులో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే!
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…