
స్వల్ప లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఎలాంటి ‘ట్విస్ట్’లకు తావు లేకుండా కనీసం ఒక్క వికెట్ కూడా పడకుండానే ఓపెనర్లు సత్తా చాటారు. ఈ సీజన్లో మంచి ఫాంలో ఉన్న రైజర్స్ కెప్టెన్ వార్నర్ 48 బంతుల్లో 74 పరుగులతో అదరగొట్టగా, శిఖర్ ధావన్ 41 బంతుల్లో 53 పరుగులు చేసి ఫాంలోకి వచ్చాడు. వీరిద్దరి బ్యాటింగ్ ప్రతిభతో కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. దీంతో రన్ రేట్ కూడా మెరుగుపడి ‘మైనస్’ నుండి ‘ప్లస్’కు మారింది.
ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ వార్నర్ అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో నిలిచి ‘ఆరంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు. వరుసగా రెండు విజయాలతో మళ్ళీ సన్ రైజర్స్ జట్టుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరో విశేషమేమిటంటే… బౌలర్ల జాబితాలోనూ 7 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ ‘పర్పల్ క్యాప్’ను వశం చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…