Telugu

‘పనామా’ దెబ్బ తగిలింది… రాజీనామా తప్పలేదు..!

విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు ‘పనామా పేపర్స్’ పేరిట విడుదలైన తరువాత ఏర్పడిన ప్రకంపనలు ఐస్ ల్యాండ్ ప్రధానిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ జాబితా విడుదలైన తరువాత పదవికి దూరమైన తొలి వ్యక్తిగా ఐస్ ల్యాండ్ ప్రధాని సిగ్ముందర్ డేవిడ్ గునాల్గుసన్ నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మీడియా ప్రతినిధుల భాగస్వామ్యంలో మొత్తం 1.15 కోట్ల పత్రాలను పరిశీలించిన తరువాత, రెండు విడతలుగా నల్లధనం దాచుకున్న వారి పేర్లు బయటకు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 140 మంది రాజకీయ నేతలున్న సంగతి తెలిసిందే.

“పార్టీ పార్లమెంటరీ సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్టు ఐస్ ల్యాండ్ ప్రధాని ప్రధాని ప్రకటించగా, తదుపరి నేను బాధ్యతలు స్వీకరిస్తా” అని పార్టీ ఉప నేత సిగూర్దర్ ఇంగి జాన్సన్ ప్రకటించారు. అంతకుముందు ఐస్ ల్యాండ్ పార్లమెంట్ లో హైడ్రామా నడిచింది. తనకు మద్దతివ్వకుంటే పార్టీని రద్దు చేస్తానని ప్రధాని సిగ్ముందర్ ప్రకటించడంతో, ఆపై పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన నిరసనలతో రాజీనామాకు అంగీకరించినట్టు తెలుస్తోంది. 2008 ఆర్థిక మాద్యంలో ఐస్ ల్యాండ్ బ్యాంకులు కుప్పకూలిన సమయంలో, సిగ్ముందర్, ఆయన భార్య విదేశాల్లో మిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్టు ‘పనామా’ పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…

16 minutes ago

US Huge Scam: FBI Arrests Most Wanted Indian Kirana Owner

An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…

18 minutes ago