
మరో ఎండ్ లో కోహ్లి నింపాదిగా ఆడుతూ సెంచరీతో కధం తొక్కాడు. ధావన్ అవుటైన తర్వాత రేహనే సహకారంతో కోహ్లి రెచ్చిపోయాడు. మొత్తమ్మీద 117 బంతుల్లో 117 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ వేగం పెంచే సమయంలో అవుటయ్యాడు. రేహనే 55 బంతుల్లో 50 పరుగులు, ధోని 9 బంతుల్లో 23 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 300కు ముందు ఆగింది.
296 పరుగుల లక్ష్యాన్ని విధించిన భారత్ ఏ విధంగా ఆ స్కోర్ ను డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి. అయిదు వన్డేల సిరీస్ లో ఇప్పటికే 2 వన్డేలను కోల్పోయి వెనుకంజలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య లాంటిది. సెంటిమెంట్ రీత్యా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కాకుండా విరాట్ కోహ్లి చేసిన సెంచరీ అయినా భారత్ కు సానుకూల ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…
Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…