
“వైఎస్సార్సీపీ అనే డ్యాంకు గండిపడిందని, ఇక నీళ్ళు నిలిచే పరిస్థితి లేదని, ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తారో కూడా లెక్క చెప్పలేమని” అన్న జేసీ జగన్ భవిష్యత్తును ప్రస్తావిస్తూ… నిత్యం తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తుంటారని చెబుతున్న క్రమంలో జగన్ ను ‘వాడెబ్బా’ అంటూ సంభోదించారు. అయితే తన పొరపాటు వెంటనే తెలుసుకున్న జేసీ ‘సారీ సారీ’ అంటూ తన మాటను తప్పుగా అర్ధం చేసుకోవద్దని జగన్ కు క్షమాపణలు చెప్పాడు.
‘మావాడు అన్న భావనతోనే ఆ మాట వచ్చింది తప్ప, ఇందులో మరో ఉద్దేశం లేదని, దీనిని జగన్ మరోలా అర్ధం చేసుకోవద్దని, మీడియా మిత్రులూ… మీరు కూడా తప్పుగా రాయవద్దని’ కోరారు. నోరు జారడం అందరికీ సహజంగా ఉండే అంశమే. అయితే వెనువెంటనే తను చేసిన తప్పు తెలుసుకుని ‘క్షమాపణలు’ చెప్పడం జేసీలో చెప్పుకోదగ్గ విషయం. బహుశా అసెంబ్లీలో రోజా కూడా ఇలాగే ప్రవర్తించినట్లయితే ఆమెకు ఇన్ని తిప్పలు వచ్చేవి కాదు కదా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
For Nandamuri fans, Mokshagna Teja’s debut has gone from one of Tollywood’s most-awaited launches to…
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…