
అయితే పవన్ వ్యాఖ్యలపై గతంలో ఒకరిద్దరు ఎంపీ బహిరంగంగానే విమర్శించారు. గల్లా జయదేవ్ వంటి వారైతే స్వయంగా పవన్ ను కలిసి తాము చేస్తున్న విషయాలను చెప్తామని, అభివృద్ధి కోసం తాము ఎంతలా పాటు పడుతున్నామో వివరిస్తామని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించే ఎంపీలలో అనంతపురం ఎంపీ జేసీ స్టైలే వేరు కదా! తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ చేసిన వ్యాఖ్యలపై తనదైన రీతిలో జేసీ దివాకర్ రెడ్డి కౌంటర్లు వేసారు.
“కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ ఆ సినిమా ఆయన, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు… అయితే ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో చెప్పవయ్యా… నువ్వు చెప్పినట్టే చేస్తాం… ఊరికనే మాటలు చెప్పడం కాదు… ఏం చేస్తారు ఒత్తిడి అంటే ఎంపీలు…” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “అవకాశం దొరికితే నాలుగు మాటలు మాట్లాడతారు… దేశానికి ఉన్న లింగాలలో ఏపీ కూడా ఒక బోడి లింగం… మోడీ ఏమైనా కాస్త అటు, ఇటుగా ఉంటే ఒత్తిడి చేయడానికి నువ్వు చెప్పినట్టు ఒత్తిడి చేస్తే… ఏమైనా ఫలితం ఉండేది… అయినా ఎంపీలు అవకాశం చిక్కినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు…” అంటూ పవన్ ను ఉద్దేశించి పై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు జేసీ.
రాజకీయాల్లో జేసీ మార్క్ డైలాగ్స్ మరొకరికి సాధ్యం కాదు. ప్రాక్టికల్ గా మాట్లాడడంలో జేసీ తర్వాతే మరొకరు అన్న దానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు ఎప్పుడూ చెప్తుంటాయి. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. జేసీ అన్నట్టు నిజంగానే… ఒత్తిడి అంటే ఏ విధంగా ఒత్తిడి చేయాలో..? పవనే చెప్పేస్తే పోలా..!
The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…