
దీనితో ఆయనను ఎలాగైనా ఈ సారి ఓడించాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది. కాకపోతే టీడీపీకి గుడివాడలో సరైన నేత లేకపోవడం నానికి కలిసొచ్చే అంశం. దీనితో విజయవాడ నుండు దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్ ను రంగంలోకి దింపారు చంద్రబాబు. ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టగలిగే సత్తా ఉండడంతో అవినాష్ టీడీపీ శ్రేణులలో ఉత్సాహం నింపారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినా రావి వెంకటేశ్వరరావును కూడా కలుపుకుని ముందుకు పోవడం విశేషం.
రావి ఎన్నికల ప్రచారంలో అవినాష్ రథాన్ని నడపడంతో శ్రేణులలో పెద్దగా ఇబ్బంది లేదనే చెప్పాలి. నియోజకవర్గంలోని కాపులను ఆకట్టుకోవడానికి వంగవీటి రాధా కూడా ఉపయోగపడుతున్నారు. అయితే నాన్ – లోకల్ ఫ్యాక్టర్ అవినాష్ కు ఇబ్బంది కలిగించేది. దీనికోసం ఆయన గుడివాడలో ఇల్లు తీసుకుని గృహప్రవేశం చేశారు. వరుసగా మూడు సార్లు గెలిచినా మూడు సార్లూ ప్రతిపక్షంలో ఉండడంతో గుడివాడలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇది నానికి కొంత ప్రతికూల అంశం. అయితే ఈ సారి గెలిస్తే తనకు జగన్ క్యాబినెట్ లో మంత్రిపదవి గారంటీ అని మరొక్కసారి అవకాశం ఇవ్వాలని నాని ప్రజలని అడుగుతున్నారు. దీనితో ఏం జరగబోతుంది అనేది చూడాలి.
An Indian national on a student visa has been detained in the United States over…
ఈమధ్యకాలంలో మన దర్శకులు, కథానాయకులు సంక్రాంతి సీజన్ మీద మరీ ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసి మిగతా హాలిడే సీజన్…