
మొదటి విడతగా 5730.80 కోట్లు పంపిణీ కాబోతున్నాయి. అయితే ఈ కోలాహలంతో మంత్రి కేటీఆర్ ను ఒక సాధారణ కిరాణా వ్యాపారి తన వాట్సాఅప్ మెసేజ్ ద్వారా కదిలించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని దీని కోసం తాను కూడా తన వైపు నుండి 8000 రూపాయిలు ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిపారు.
అనిల్ అనే ఆ వ్యాపారి ఉప్పల్ నివాసి. 4000 వెంటనే పంపుతా అని, మిగిలిన సొమ్ము వచ్చే నెల పంపుతా అని చెప్పిన ఆ చిరు వ్యాపారికి కేటీఆర్ హ్యాట్సాఫ్ చెప్పారు. మరోవైపు బాగా డబ్బున్న రైతులు ఈ సాయాన్ని స్వచ్చందంగా వదులుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. తద్వారా అవసరమైన రైతులకు ఆ సాయం అందేలా చేసినట్టు అవుతుందని ప్రభుత్వం చెప్పింది.
In an interesting development, Nandamuri Balakrishna is reportedly teaming up with Koratala Siva, choosing a…
A shocking and disturbing incident has been reported from Bengaluru, where a young man was…