
కడప జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీ.ఎస్.ఓ)ని లింగారెడ్డి బెదిరించినట్లు ‘సాక్షి’ పత్రికలో ఓ వార్త ప్రచురితమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లింగారెడ్డి… “పరిటాల రవి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న వ్యక్తి రేషన్ షాపును నిర్వహిస్తుండటమే కాక అక్రమాలకు పాల్పడుతున్న విషయంపై డీ.ఎస్.ఓ.ను వివరణ అడిగానని” తెలిపారు. అయితే డీ.ఎస్.ఓ.ను తాను దూషించలేదని, వాస్తవాలకు విరుద్ధంగా ‘సాక్షి’ దినపత్రిక తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
డీ.ఎస్.ఓ.ను తాను దూషించినట్లు నిరూపించలేకపోతే ‘సాక్షి’ పత్రికపై క్రిమినల్ కేసు వేస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. తప్పుడు కధనాలకు కేరాఫ్ అడ్రస్ గా ‘సాక్షి’ పత్రిక మారుతోందని, ఇటీవల కాలంలో మరింత పెచ్చుమీరుతోందని, ఒకప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఆరోపణలు, తాజాగా అధికారుల స్థాయి వరకు చేరుకుందన్న అభిప్రాయాలను టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
Pics: Nandamuri Mokshagna’s Debut Announced
The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…