
‘రైల్వే జోన్ – విశాఖ హక్కు’ అంటూ చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన సందర్భంగా వ్యాఖ్యానించిన రోజా… ‘తెలుగుదేశం పార్టీలో మగాళ్ళే లేరంటూ’ తీవ్ర పదజాలాన్ని వినియోగించింది. టీడీపీలో మగాళ్లు లేక వైఎస్సార్సీపీకి చెందిన నేతలను ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని, చంద్రబాబుకు దమ్ముంటే, ఆయనే కనక రాయలసీమ బిడ్డ అయితే తక్షణం వారందర్నీ పదవులకు రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. విభజన చట్టంలో రైల్వే జోన్ విశాఖకు వస్తుందని పేర్కొన్నారని, చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని విమర్శించారు.
గతంలో ఇలాంటి ‘దురుసు’ వ్యాఖ్యలే అసెంబ్లీ వేదికగా ప్రసంగించి ఒక సంవత్సరం పాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ అయ్యారు. ఓ పక్కన దీనిపై విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో మరోసారి అలాంటి విమర్శలకు తావిచ్చే పలుకులే పలకడం బహుశా రోజాకు మాత్రమే చెల్లుతుందేమో అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సినీ లెవల్లో ‘మగాళ్ళు, రాయలసీమ బిడ్డ’ అంటూ వ్యాఖ్యానించడం… బహుశా తన సినీ పరిభాషపై పట్టు కోల్పోలేదని చాటిచెప్పడానికేమో… అన్న వాదన తెరపైకి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…