
నేడు మొహాలీ వేదికగా జరిగిన రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఘనవిజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ లలో పేలవమైన ఆటతీరుతో విమర్శల పాలైన పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రహానే (9), పీటర్సన్ (15), పెరీరా (8), ధోనీ (1), ఇర్ఫాన్ పఠాన్ (2) విఫలం కాగా, డుప్లెసిస్ (67), స్మిత్ (38) రాణించడంతో కనీసం ఆ మాత్రం స్కోర్ నైనా నమోదు చేయగలిగింది.
153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు మురళీ విజయ్ (53), వోహ్రా (51) అర్ధ సెంచరీలతో రాణించి మంచి శుభారంభం అందించారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ ఔటైన తర్వాత, మురుగన్ అశ్విన్ ధాటికి మార్ష్ (4), మిల్లర్ (7) కూడా త్వరగా పెవిలియన్ చేరారు. దీంతో కాస్త కంగారు పడ్డ పంజాబ్ జట్టును సాహా (4) అండతో మ్యాక్స్ వెల్ విజయానికి చేర్చాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 32 పరుగులతో చెలరేగడంతో 18.4 ఓవర్లో పంజాబ్ విజయం సాధించింది. పూణే జట్టు మాదిరే పంజాబ్ జట్టు కూడా మూడు మ్యాచ్ లలో ఒక్క విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…