
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించిన భువనేశ్వరి… “తెలుగు జాతి కీర్తి, ప్రతిష్టలకు కారణమైన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన కూతురుగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నేల 18వ తేదీన నిర్వహించబోయే రక్తదాన శిభిరంలో అభిమానులంతా పాలుపంచుకోవాలని, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని” పిలుపునిచ్చారు.
గతంలో తొమ్మిదేళ్లల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనీసం మీడియాకు ముఖం చూపించని భువనేశ్వరి, ఇటీవల శంకుస్థాపన, పుష్కరాల ప్రారంభం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. అయితే, తొలిసారిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారనే సమాచారం అందుకున్న మీడియా వర్గం ఒకింత ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ సంచలన విషయాలు ఏమైనా బయటకు వస్తాయోమోనని అంచనా వేసింది. అయితే ఎలాంటి వివాదాలకు, సంచలనాలకు తావు లేకుండా తొలి ప్రెస్ మీట్ తన తండ్రిని ఉద్దేశించి ప్రసంగించారు.
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…