
ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో పోటీ చెయ్యనుండడంతో అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. శుక్రవారం ఆయన తాను పోటీచేసే నియోజకవర్గం మంగళగిరిలో ప్రచారం మొదలు పెట్టారు. నా వద్ద పీఏ వ్యవస్థ ఉండదు.. కార్యకర్తలు, ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు లోకేష్. అందరి ఫోన్ కాల్స్కు, మెసేజ్లకు తాను సమాధానం ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. దీనితో బాలయ్య చేసిన తప్పు లోకేష్ చెయ్యడని తేలింది.
మంగళగిరిలో పోటీ అంటే లోకేష్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్టే. 1983లో టీడీపీ ఆవిర్భావం నుండి ఈ సీటును కేవలం రెండు సార్లే ఆ పార్టీ గెలిచింది. 1989 తరువాత అయితే ఇక్కడ నుండి టీడీపీ గెలిచింది లేదు. 2014లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి కేవలం 12 ఓట్లతో ఓడిపోయారు. కాకపోతే అమరావతి రాజధానిగా ప్రకటించాక మంగళగిరిలో అభివృద్ధి బాగా జరిగింది. దాని మీద ధీమాతోనే లోకేష్ ఇక్కడ నుండి పోటీ చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నారు.
The general trend is that the urban population are generally slow and low when it…
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…