
“తన ఆస్తులను 200 కోట్ల రూపాయలుగా షరీఫ్ పేర్కొన్నారని పాకిస్తాన్ ఎన్నికల సంఘం తెలిపింది. తన ఆస్తుల్లో సింహభాగం తన కుమారుడు పంపినవేనని, ఆ కారణంగానే గత నాలుగేళ్లలో వంద కోట్ల రూపాయలు పెరిగి, 200 కోట్ల రూపాయలకు చేరాయని తెలిపారు. అలాగే విదేశాల్లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని షరీఫ్ స్పష్టం చేశారు. తన దగ్గర టయోటా ల్యాండ్ క్రూయిజర్, రెండు మెర్సిడెస్ బెంజ్ వాహనాలు ఉన్నాయని ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో తెలిపారు.
తాజా సమాచారంతో పాకిస్థాన్ పార్లమెంటులో అత్యంత ధనికుడిగా షరీఫ్ నిలిచారు. తరువాతి స్థానాల్లో ఆ దేశ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ, ఎంపీలు ఖయాల్ జమాన్, సాజిద్ హుస్సేన్ ఉన్నారు. ఈ ధృవీకరణతో ‘పనామా’ పేపర్స్ లో వచ్చిన సమాచారానికి మరింత విలువ దక్కుతోంది. పక్కా సమాచారంతోనే ‘పనామా’ సంచలన విషయాలను బయట పెట్టిందన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…