
మరోవైపు ఈ ఎన్నికలలో కూడా కారు తన జోరు చూపించింది. ఆ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయ ఢంకా మోగించారు. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా సగం పైగా అంటే తెరాస 2629 పంచాయితీలు గెలుచుకోవడం విశేషం. 902 స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకోగా.. మరే ఇతర పార్టీలు రెండంకెల స్థానాలు దాటలేకపోయాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెంటనే వచ్చిన ఈ ఎన్నికల మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ మాత్రం దృష్టి పెట్టలేదు.
పైగా శ్రేణులు, నాయకులు పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఈ మాత్రం పంచాయతీలు వచ్చాయంటే గణనీయమైనవే కదా! ఈ రెండు పార్టీలు కాకుండా తెలుగు దేశం పార్టీ 31, భాజపా 67, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 758 చోట్ల విజయం సాధించారు. పలు కారణాల వల్ల 14 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఇంకో రెండు దశలలో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో కూడా అధికార పార్టీనే పై చెయ్యి సాధించే అవకాశం ఉంది.
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…
Since the official announcement of Allu Arjun and Lokesh Kanagaraj's tentatively titled AA23, fans have…