
ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ దీని మీద ట్విట్టర్ లో స్పందించారు. టీడీపీ, వైసీపీలు జనసేనను దెబ్బతీయడానికి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఓ సీనియర్ రాజకీయ నేత తనకు చెప్పారన్నారు పవన్. ఈ విషయాలన్నీ చెప్పడానికి తనకు న్యూస్ పేపర్, ఛానల్ లేదని.. జనసైనికులే తనకు పేపర్లు, ఛానల్స్ అన్నారు. రాజకీయ చదరంగంలో తానో చిన్న పావునన్నది నిజమే.. కానీ పోరాటానికి సిద్ధమైన సైనికుడిని అన్నారు జనసేనాని.
అయితే దీనిపై టీడీపీ అభిమానులు మండి పడుతున్నారు. “సాక్షిలో వచ్చిన వార్తలకు టీడీపీకి ఏం సంబంధం? మొన్నటి వరకూ అవే వార్తలను మోసి మమల్ని విమర్శించారు. ఇప్పుడు సాక్షి తన నిజస్వరూపం చూపించింది. జనసేన తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీని విమర్శించక్కర్లేదు,” అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా తనకు టీవీ, పేపర్ లేవు అనడాన్ని కూడా పలువురు ఆక్షేపిస్తున్నారు. “వైకాపాకు సాక్షి ఎలాగో జనసేనకు ఆంధ్రప్రభ అలా ఉంది ఈరోజున. అదే విధంగా 99టీవీ ఛానల్ కూడా. ముత్తా గోపాల కృష్ణ ఆంధ్రప్రభ జనసేనలో చేరలేదా? జనసేన ప్రధానకార్యదర్శి తోట చంద్రశేఖర్ 99టీవీల్లో వాటా కొనలేదా? పవన్ కళ్యాణ్ ప్రజలను ఏమని నమ్మించాలనుకుంటున్నారు?,” అంటూ విమర్శిస్తున్నారు.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…