
‘విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో పలువురు మంత్రులతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఉందన్న సమాచారం తనకు తెలుసని’ అన్న పవన్ వ్యాఖ్యలపై ఎంతవరకు నిలబడతారో చూడాలి. ఎందుకంటే గతంలో లోకేష్ పై కూడా ఇలాగే అవినీతి ఆరోపణలు చేసి నాలుక కరచుకున్న విషయం తెలిసిందే. ‘ఎవరో చెప్పారు, అందుకే తాను అన్నానంటూ’ బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేసిన పవన్, ఈ సారైనా చేసిన విమర్శకు కట్టుబడి ఉంటారో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే అనాలోచితమైన ప్రకటనలు చేస్తూ ప్రజలలో తన ప్రభావాన్ని తగ్గించుకుంటున్న పవన్, ఈ సారి ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడంతో, నిజంగానే పవన్ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎందుకు బయట పెట్టకుండా ఈ బెదిరింపు రాజకీయాలు ఎందులకు? ఈ సారి ఖచ్చితంగా పవన్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి ఇలా ఏదొక విమర్శ చేసి, వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు అంటే రాజకీయాలలో నడవదు, అందులోనూ రాజకీయ ప్రక్షాళన చేస్తానంటున్న పవన్ కు అస్సలు చెల్లుబాటు కాదు.
పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ముఖ్యమంత్రులలో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రులు కూడా వేరేగా ఉంటారు. ఆ కోవకు చెందినవారే…
YS Jagan and KTR publicly refer to each other as brothers, and the two of…