Telugu

పవన్ కళ్యాణ్ ఇదేమి తడబాటు? మాయావతి పీఎంగా కావాలా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. వారి మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలకు గట్టిగా పాతిక రోజులు కూడా లేవు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా ఉత్తర్ ప్రదేశ్ వెళ్ళి బహుజన్ సమాజావాది పార్టీ అధినేత్రి మాయావతిని కలిశారు. తమ పార్టీ బీఎస్పీ తో పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించారు. పైగా మాయావతిని తాము దేశప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.

బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే ఏమొస్తుందో ఎవరికీ అంతుబట్టని ప్రశ్న… పైగా మాయావతిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మకిలి ఎందుకు అంటించుకుంటున్నారో అర్ధం కానీ ప్రశ్న. దీనివల్ల దళితుల ఓట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ అంచనా కావొచ్చు. వారిలో ఎక్కువ శాతం జగన్ వైపు ఉన్నారు. మాయావతి అంతగా ప్రభావం చూపించగలిగే నేత అయితే ఆమె పార్టీనే ఇక్కడ ప్రబల శక్తిగా ఉండేది. మరి పవన్ కళ్యాణ్ ఉద్దేశమేంటో అర్ధం కాదు.

ADVERTISEMENT

ఒకవేళ జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపించటానికి అనుకుంటే జనసేన రాష్ట్రంలోనే ఇబ్బంది పడుతుంది. ఇప్పటికి కేవలం 32 ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటించగల్గింది. మిగతా పని చూడకుండా ఉత్తర్ ప్రదేశ్ యాత్ర ఏంటో? ఇప్పుడు ఆ సంగతి చూడకుండా జాతీయ రాజకీయాలేంటో? ఎన్నికలు సమీపించే కొద్దీ పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతున్నారు. దీనికి ఆయన వచ్చే ఎన్నికలలో భారీ మూల్యమే చెల్లించాల్సి రావొచ్చు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ICE Arrests Andhra Student as Convicted Child Predator

An Indian national on a student visa has been detained in the United States over…

26 minutes ago

సమ్మర్ సీజన్ ని రీ రిలీజులకి వదిలేశారుగా..

ఈమధ్యకాలంలో మన దర్శకులు, కథానాయకులు సంక్రాంతి సీజన్ మీద మరీ ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసి మిగతా హాలిడే సీజన్…

36 minutes ago