
అయితే సినీ వర్గాలలో హల్చల్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను కొనుగోలు చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తన తదుపరి సినిమా “హుషారు”ను తక్కువ ధరకు విక్రయించి ‘న్యాయం’ చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ధికంగా ప్రస్తుతం నష్టాలను పూడ్చేటంత బలంగా లేకపోవడంతో తదుపరి సినిమాపైనే ఆధారపడ్డారని టాక్.
వరుసగా సినిమాలు అంగీకరించిన పవన్, తదుపరి చిత్రంగా ఎస్ జే సూర్య దర్శకత్వంలో ‘హుషారు’ ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. అలాగే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఇవి కాకుండా దాసరి బ్యానర్లో మరో సినిమా ఉండనుంది. అయితే ‘సర్ధార్’ సినిమాకు వెల్లువెత్తిన విమర్శలను, నష్టాలను తన ‘హుషారు’తోనే బదులు చెప్పేందుకు పవన్ డిసైడ్ అయినట్లు ట్రేడ్ వర్గాల టాక్.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…