
తుని ఘటనపై స్పందించడానికి కేరళ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్, తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత మీడియా వర్గీయులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ క్రమంలోనే చిరు లేఖను చదివి వినిపించిన ఓ మీడియా ప్రముఖుడు, దీనిపై స్పందిన్చాల్సింగా కోరారు. అయితే, సదరు మీడియా ప్రతినిధి చదివిన మొత్తాన్ని విన్న పవన్, దానిని పక్కన పెట్టి మరో ప్రశ్నకు జవాబివ్వడం విశేషం. ఇదంతా మీడియా మాధ్యమాలలో ‘లైవ్’ ప్రసారం కావడంతో, చిరు లేఖకు పవన్ ఇచ్చిన ప్రాధాన్యత ప్రత్యక్షమైంది.
బహుశా చిరు వ్యక్తపరిచిన అభిప్రాయం తన భావాలతో విభేదించడం వలనే పవన్, ఆ ప్రశ్నను ఎస్కేప్ చేసి ఉంటారని లేదంటే దానికి కూడా జవాబిచ్చేవారని పరిశీలకులు అంటున్నారు. అయితే, చిరంజీవి రాసిన లేఖ కంటే, పవన్ ప్రసంగమే కాస్త మెరుగగా, పరిపక్వతతో ఉందని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.
Madhavan's GDN directed by Krishnakumar Ramakumar was released in theatres on August 7th and has…
Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…