
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో నడక మార్గం ద్వారా తిరుమల కొండపైకి ఎక్కారు. కాలి నడకన కొండపైకి చేరుకునేందుకు ఆయనకు రెండు గంటల సమయం పట్టింది. పాదయాత్ర ముగిసిన తర్వాత ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి కూడా నడకన తిరుమలకు వెళ్లారు. ఆయన మూడున్నర గంటల్లో తిరుమలకు చేరుకున్నారు. మొన్నా మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య నడకమార్గంలో తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శించుకున్నారు.
ఆయన దాదాపు మూడున్నర గంటల్లో ఆయన కొండపైకి చేరుకున్నారు. మార్గమధ్యలో ఎన్నో బ్రేకులు తీసుకున్నారు. దారి పొడవునా చెమటతో తడిసి మొద్దయిపోయారు. 2009 లో కాంగ్రెస్ నేత, నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన కొత్తలో నడకమార్గంలో తిరుమలకు వెళ్లారు. కొండ ఎక్కే సమయంలో ఆయన చాలా చోట్ల విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆయనకు ఏడున్నర గంటల సమయం పట్టింది. రాజకీయ నాయకులలో ఒక రకంగా చిరంజీవి బాగా ఎక్కువ సమయం తీసుకున్నట్టు… రాహుల్ తక్కువ తీసుకున్నారు. 70 ఏళ్ళ వయసులో చంద్రబాబు రాహుల్ తో సమానంగా నడవడం విశేషం.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…