
నగరంలోని నీటి వనరుల్లో 79 శాతం కరిగిపోయాయని, ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని, పట్టణీకరణ నగరాన్ని నాశనం చేస్తున్న పద్ధతిని చూపుతుందని ఐఐఎస్సీ ప్రొఫెసర్ టీవీ రామచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నగరం నివాసయోగ్యం కాదని చెప్పే పరిస్థితి నుంచి, ఐదేళ్లలోనే నగరం రూపురేఖలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే స్థాయికి వచ్చాయని చెప్పాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవలి కాలం వరకూ సహజ వాయువులతో నిండిన నగరం, ఇప్పుడు విషపూరిత కాలుష్యాలతో నిండిపోయిందని అన్నారు.
సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న నగరానికి నదుల సౌకర్యం లేదని, కేవలం 600 చిన్న, పెద్ద సరస్సులతో నగరం పచ్చగా ఉండేదని వెల్లడించిన ఆయన, గడచిన రెండేళ్లలో అత్యధిక సరస్సులు అంతరించాయని, నీటిని 100 కిలోమీటర్ల దూరంలోని కావేరీ నది నుంచి పైపుల ద్వారా తేవాల్సి వస్తోందని అన్నారు. 25 ఏళ్ల క్రితం 40 లక్షలుగా ఉన్న జనాభా, ఇప్పుడు కోటికి పైగా చేరుకుందని, ప్రభుత్వాలు వెంటనే స్పందించకుంటే పరిస్థితి మరింత జటిలమవుతుందని హెచ్చరికలు జారీ చేసారు.
The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…