
అయితే ఇదే సమయంలో రమేశ్ నిర్మించిన రెండు సినిమాలు దారుణ పరాజయాలు పాలవ్వడంతో కొంత ఆర్ధికంగా వెనక్కి వెళ్ళారని, ఈ క్రమంలో అతను ఇచ్చిన కొన్ని చెక్కులను చెల్లించలేకపోయాడని కోర్టులో కేసులు నమోదయ్యాయి. అలాంటి ఓ కేసులో తాజాగా న్యాయస్థానం దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువడింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి నుంచి శింగనమల రమేష్ 15 లక్షల రూపాయలు అప్పు తీసుకుని, తిరిగి చెక్కు ఇచ్చి దానిని బౌన్స్ చేసారు. దీంతో బాధితుడు కర్నూలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కేసును విచారించిన న్యాయస్థానం సింగమనల రమేశ్ కు ఏడాది కాలం పాటు జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…
An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…