
నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన వేళ, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదన విన్న అనంతరం, “500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన వేళ, మీరనుకున్నంత మేరకు కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టారా? అసలెంత కొత్త కరెన్సీ కావాలని అంచనా వేశారు? మీ వద్ద ఏదైనా ప్లాన్ వుందా? 10 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వస్తాయని భావిస్తే, అంత మొత్తం కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు ఏఎం ఖాన్ విల్కార్, డీ చంద్రచూడ్ ల ధర్మాసనం కేసును విచారించింది. కాగా, డిసెంబర్ 31లోగా మరో రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ కావచ్చని అంచనా వేస్తున్నట్టు అటార్నీ జనరల్ తెలిపారు. కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తూ… తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మోడీ సర్కార్ ను ధర్మాసనం ఆదేశించింది.
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…
Allu Arjun’s Raaka has not received an official release date announcement from Sun Pictures yet.…