
నామాను పార్టీలోకి తేవడంతో ఆయన బద్ద విరోధి, ఆయనను వ్యతిరేకించి టీడీపీ నుండి తెరాస లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోతున్నారని సమాచారం. తుమ్మలను పార్లమెంట్ కు పంపిస్తారని ఒక సమయంలో బాగా చర్చ నడిచింది. ఈరోజు పార్టీలో చేరిన నామా ఈరోజు ప్రకటించనున్న తెరాస ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఉండటం విశేషం. దీనిని తెరాస అభిమానులు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉండి కూడా ఇంతకు దిగజారాలా అని వారు పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు.
నామా వంటి చంద్రబాబు తొత్తుని పార్టీలో చేర్చుకోవడమే ఎక్కువ అటువంటిది ఆయనకు టిక్కెట్ ఇవ్వడమేంటి అని వారి వాదనగా ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోను గత ఎన్నికలలో తెరాస భారీ విజయం సాధించినా ఖమ్మంలో కేవలం ఒకే ఒక్క స్థానము గెలిచింది. కాంగ్రెస్ ఆరు, టీడీపీ రెండు, ఒక్క స్వతంత్రుడు గెలిచారు. కాంగ్రెస్ నుండి జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కారు ఎక్కినా జిల్లాలో మొత్తంగా కాంగ్రెస్, టీడీపీలను ఖాళీ చెయ్యాలని తెరాస భావిస్తుంది.
An Indian national on a student visa has been detained in the United States over…
ఈమధ్యకాలంలో మన దర్శకులు, కథానాయకులు సంక్రాంతి సీజన్ మీద మరీ ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసి మిగతా హాలిడే సీజన్…