
ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (74), షాన్ మార్ష్ (23) వీర విహారం చేసి తొలి 9 ఓవర్లలోనే 90కి పైగా పరుగులు సాధించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అయితే ఈ దశలో స్పిన్నర్లను రంగంలోకి దించడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మార్ష్ ను అశ్విన్ పెవిలియన్ బాటపట్టించడంతో ఆసీస్ పతనం మొదలైంది. లిన్ (2), మ్యాక్స్ వెల్ (1), షేన్ వాట్సన్ (15), జేమ్స్ ఫాల్కనర్ (10), జాన్ హేస్టింగ్స్ (4), టై (4) వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. మథ్యూ వేడ్ (16) నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది.
భారత బౌలర్లలో జడేజా, బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా, అశ్విన్, పాండ్య చెరో వికెట్ తో రాణించారు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ గెలుచుకుంది. దీంతో ఆసీస్ లో టీ ట్వంటీ మ్యాచ్ గెలిచిన కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. చాలా కాలం తర్వాత ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మరి కొద్ది రోజుల్లో టీ-20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ విజయం భారత జట్టుకు మరింత విశ్వాసాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
Priya Bhavani Shankar is taking the internet by storm with her latest indoor photoshoot, proving…
Madhavan's GDN directed by Krishnakumar Ramakumar was released in theatres on August 7th and has…