
[m9ad]
అయితే కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఎమ్మెల్యేలు కొత్త పంథా ఎంచుకున్నారు. అదేంటంటే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడును తిట్టడం. కొందరైతే ఏకంగా అమరావతి వెళ్ళి వారి వారి కులాల మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఏదో విధంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి మీడియాలో విస్తృతంగా కనిపిస్తే తమ స్వామి భక్తి కేసీఆర్ కు చేరుతుందని, కేబినెట్ విస్తరణ సమయంలో తమను దృష్టిలో పెట్టుకుంటారని వారి తాపత్రయం.
కొందరేమో వచ్చే ప్రధాన మంత్రి కేసీఆరేనని, తెలంగాణ పథకాలు దేశానికే తలమానికమని మీడియా ముందు ఊదరగొడుతున్నారు. మరో వైపు ఆ మధ్య ఈ నెల 5 లేక 6 తారీఖులలో కేబినెట్ విస్తరణ ఉండొచ్చని సమాచారం వచ్చినా ఆ తరువాత దాని గురించి ఊసు లేదు. మరోవైపు మంత్రులు లేనందు వల్ల పాలన కుంటుపడిందని సమాచారం. వివిధ శాఖలలో ఫైళ్లు ఎన్నో పెండింగు ఉండిపోయాయని సమాచారం. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారో ఎవరికీ తెలియడం లేదు.
According to recent survey data, Telangana has emerged as the most expensive state in the…
There is an interesting parallel being discussed around this election. It comes down to how…