
విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొన్న రవిప్రకాష్, అవినీతిపై ప్రసంగించారు. దేశంలో ఓ ఏడెనిమిది కుటుంబాలే రాజకీయాలను శాసిస్తున్నాయని, అధికార పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా పార్టీలు, రాజకీయ నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. వేల కోట్ల కుంభకోణాలు చేసినవారు రాజకీయాల్లో చలామణి అవుతున్నారని, బ్యాంకుల్ని నిండా ముంచిన వాళ్ళు నాయకులుగా మారారని… ప్రజల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నందు వలనే ఇది సాధ్యపడుతోందని, రాజకీయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు.
అవినీతి విషయంలో ఎవరైనా అధికార ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమే. ‘అధికారం’ ఎంతటి కార్యాన్నైనా చేసి చూపిస్తుంది కాబట్టి ‘అవినీతి’ అన్నది ‘పవర్’ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ, రవిప్రకాష్ అధికార ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాన్ని కూడా విమర్శించడం, అలాగే వేల కోట్లు కుంభకోణాలు చేసిన వారు రాజకీయాల్లో ఎదగడం అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ ను టార్గెట్ చేసినవేనని విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న మాటలు. గతంలో జగన్ – రవిప్రకాష్ ల మధ్య హాట్ హాట్ చర్చలు జరిగాయని రాజకీయ, మీడియా వర్గాల్లో వార్తలు వినపడ్డ నేపధ్యంలో ప్రస్తుతం రవిప్రకాష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…