
అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసినప్పటికీ రోజా అనారోగ్యం కారణంగా కమిటీ ముందు హాజరు కాలేదు. తనకు మరో 15 రోజుల సమయం కావాలని ఆమె కొద్దిరోజుల ముందు లేఖను పంపారు.
గతంలో ఎన్నిసార్లు పిలిచినా ఆమె కమిటీ పిలుపును లెక్కచేయలేదనీ, కనుక ఆమె విన్నపాన్ని ఈ సారి పరిగణనలోనికి తీసుకోవాల్సిన పనిలేదని తొలుత అభిప్రాయపడిన కమిటీ, చివరకు మరో అవకాశం ఇస్తూ నోటీసులు జారీ చేసారు. దీంతో ఈ సారి హాజరై తన తప్పు లేదని నిరూపించుకునే బాధ్యత రోజా వంతయ్యింది.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…
An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…