
అయితే ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ప్లస్ కాకపోగా మైనస్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ప్రజలు ఎప్పుడైనా మాటలు చెప్పే వాడికైనా ఇప్పుడు ఇచ్చే వాడికి ఎక్కువ విలువ. అదే సమయంలో వేలం పాటలా పెంచుకుంటూ పోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు 3100 రూపాయిలు పెంచి పెన్షన్ ఇస్తే జగన్ ఏం చేస్తారు? మళ్ళీ 3500, 4000 అంటూ పెంచుకుంటూ పోతారా? దీనికి అడ్డు ఎక్కడ? దీనికి ఏదైనా శాస్త్రీయ అధ్యయనం ఏదైనా ఉందా?
గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పెన్షన్లు 1000 రూపాయిలు ఇస్తామని ప్రకటిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వల్ల అలా ఇవ్వడం కుదరదని 700 మాత్రమే ఇవ్వగలమని చెప్పి అదే విషయం తమ మ్యానిఫెస్టో లో పెట్టారు. ఐదు సంవత్సరాల ముందు 700కు మించి కుదరదని ఇప్పుడు ఏకంగా 3000 రూపాయిలు ఇస్తామంటే దానిని జగన్ ఏ విధంగా సమర్ధించుకుంటారు? కొంపతీసి చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని విపరీతంగా మెరుగు పరిచారా? అలా అని జగన్ ఒప్పుకుంటున్నారా?
ఇటీవలే ఓటు ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. శాసనసభను బహిష్కరించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్ష పార్టీ సభలో లేదు. అయితే మీడియా ముఖంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ బడ్జెట్ ను ఖండించింది. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన బడ్జెట్ అని, ఎన్నికల గిమ్మిక్ అని తేల్చి చెప్పేశారు. అయితే అదే సమయంలో తాము ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి బడ్జెట్ లో పెట్టారని చెప్పుకొస్తున్నారు. అంటే నవరత్నాలు అమలు చేస్తే అది అశాస్త్రీయమంటే ప్రజలు ఏమనుకోవాలి? ఇలా ఒకటి తరువాత ఒకటి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతున్నారు జగన్.
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…
Since the official announcement of Allu Arjun and Lokesh Kanagaraj's tentatively titled AA23, fans have…