
ఈ కార్యక్రమానికి ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే షర్మిలకు అనారోగ్యమంటూ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ను కనీసం ఆహ్వానించకపోవడం విశేషం.
జగన్ అధికారంలోకి వస్తే అమరావతి నుండి రాజధానిని తరలిస్తారని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జగన్ అమరావతిలో ఇల్లు, కార్యాలయం నిర్మించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో కృష్ణ, గుంటూరు జిల్లాలలోని ప్రజల అనుమానాలు దూరం అవుతాయని వారు భావిస్తున్నారు. అమరావతిలో స్థిరనివాసం ఉన్న ఒకే ఒక్క ప్రధాన పార్టీ అధ్యక్షుడు జగన్ మాత్రమే. ఎన్నికల వరకు జగన్ ఇక్కడి నుండే పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోనున్నారు. అవసరమైనప్పుడు హైదరాబాద్ వెళ్లి వస్తారు.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…