
అయితే ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు కేవలం ప్రొవిజనల్ అటాచ్ మెంట్స్ మాత్రమేనని, దీనిని అడ్జ్యూడికేటింగ్ అధారిటీ ధృవీకరించాల్సి ఉంటుందని సమాచారం. ఒక్కసారి ఈ అధారిటీ ధృవీకరిస్తే ఇక జగన్ కు ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్లేనని న్యాయనిపుణుల సమాచారం. అయితే ఈ అటాచ్ మెంట్ ను సవాల్ చేస్తే… అడ్జ్యూడికేటింగ్ అధారిటీ ముందు జగన్ తన వాదనను వినిపించుకోవచ్చని, అయినప్పటికీ ఈ ప్రక్రియ ముందుకెళితే హైకోర్టు, చివరగా… సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చని సమాచారం.
అయితే, అడ్జ్యూడికేటింగ్ అధారిటీ ఆస్తుల అటాచ్ మెంట్ ను గనుక ధృవీకరిస్తే… హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళినా పెద్దగా లాభం ఉండకపోవచ్చని, గతంలో జరిగిన కొన్ని ఉదంతాలను మీడియా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. నిజానికి గతంలో జగన్ ఆస్తులను అటాచ్ చేసిన సమయంలో హైకోర్టుకు వెళ్ళిన జగన్ కు చుక్కెదురైన సందర్భాన్ని వివరిస్తున్నారు. అంటే ప్రస్తుతం జగన్ భవిష్యత్తు ‘అడ్జ్యూడికేటింగ్ అధారిటీ’ చేతిలో ఉన్నట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
దీంతో పాటు జగన్ ఆస్తులు ప్రజలకు సంబంధించినవి అవి తిరిగి ప్రజలకు మాత్రమే చెందాలని ఒక కొత్త చట్టాన్ని ఏపీ సర్కార్ రూపొందించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేసిన ఈ చట్టం ద్వారా ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఎలా లభిస్తుందన్న దానిపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికను, మీడియాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందన్న సంకేతాలను గతంలో సిఎం వ్యక్తపరిచిన నేపధ్యంలో… మున్ముందు పరిణామాలు ఎలా జరగబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది.
‘క్రింద పడినా తనదే పై చేయి’ అన్నట్లుగా ఇప్పటివరకు తన మీడియా ‘సాక్షి’గా విరుచుకుపడ్డ జగన్ స్పందన కోసం సర్వత్రా వేచిచూస్తున్నారు. అయితే ఇపుడు ఆ ‘సాక్షి’ గొంతే మూగబోయే పరిస్థితులు ఏర్పడుతుండడంతో ఏ విధంగా తన స్వరాన్ని మార్చుకుంటారో చూడాలి. చూడబోతుంటే… “ముందుంది ముసళ్ళ పండగ” అన్న నానుడిగా జగన్ భవిష్యత్తు ఉండబోతుందన్న మాటలు పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…