
జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ రాష్ట్రంలో రాజకీయాలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఆ స్కీం ఈ స్కీం అంటూ జనాలను గుక్కతిప్పుకోనివ్వకుండా తాయిలాలు కురిపిస్తున్నారు. మరోపక్క తాము ఏమీ తక్కువ తినలేదు అన్నట్టు జగన్ కూడా టీడీపీ నుండి అసంతృప్త ఎమ్మెల్యేలను ఎంపీలను పార్టీలోని తీసుకుంటూ అధికార పార్టీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. జగన్ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఈ చేరికలు మందగించవచ్చు.
అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం కూడా కొత్త పథకాలు ఏమీ ప్రకటించే వీలు లేదు. మరోవైపు జగన్ తిరిగి వచ్చాక అమరావతిలోని తన కొత్త ఇంటి గృహప్రవేశం ఉంటుందని తెలుస్తుంది. అది ఇప్పటికే జరగాల్సి ఉండగా చివరి నిముషంలో వాయిదా పడింది. ఆ తరువాత ఎన్నికల వరకు అమరావతిలోని ఉంటూ ప్రజలకు భరోసా కలిపించాలని జగన్ వ్యూహంగా ఉంది. ఇప్పటివరకు జగన్ హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ ఇంటి నుండే పార్టీ కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారు.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…